ఏపిలో జగన్‌ ప్రభుత్వం మరో పథకం

రేచీకటి బారిన పడకుండా చర్యలు

AP CM YS JAGAN
AP CM YS JAGAN

అమరావతి: ఏపిలోని చిన్నారులు రేచీకటి బారిన పడకుండా సిఎం జగన్‌ ప్రభుత్వం మరో పథకాన్ని ఈరోజు నుండి ప్రారంభించింది. ఈ నెల 31 వరకూ అన్ని అంగన్ వాడీ కేంద్రాల్లో ఐదేళ్లలోపు పిల్లలకు విటమిన్ ఏ సప్లిమెంటరీ సిరప్ ను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ‘అక్టోబర్ 13 వ తేదీ నుంచి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం 5 సం.ల లోపు పిల్లలందరికీ విటమిన్ఏ సప్లిమెంటేషన్ సిరప్ ఇస్తుంది. 5 సం. లోపు పిల్లల తల్లితండ్రులు అందరూ దగ్గరలోని అంగనవాడి కేంద్రాన్ని సంప్రదించి మీ పిల్లలకి విటమిన్ఏ సిరప్ వేయించండి. వారి ఆరోగ్య సురక్షితకు జాగ్రత్త తీసుకోండి’ అని జగన్ సర్కారు వెల్లడించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/