విష్ణు కు మాట ఇచ్చిన చిరంజీవి..

మెగాస్టార్ చిరంజీవి ఓ మాట ఇచ్చారంటే..ఆ మాట మీద నిలబడతారని చిత్రసీమలో అంత అంటుంటారు. ప్రస్తుతం నిర్మాత విష్ణువర్ధన్ ఇందూరికి మాట ఇచ్చినట్లు తెలుస్తుంది. చిరంజీవి ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య పూర్తి చేసాడు. ఫిబ్రవరి 04 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే ‘గాడ్ ఫాదర్’ .. ‘భోళా శంకర్’ .. ‘వాల్తేర్ వాసు’ సినిమాలను ప్రకటించారు.

ఇదిలా ఉంటె..నిర్మాత విష్ణువర్ధన్ ఇందూరితో చిరంజీవికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇటీవల ఇద్దరూ కలిసినప్పుడు తమ కాంబినేషన్లో ఒక సినిమా చేస్తే బాగుటుందని విష్ణు అనగా, అందుకు చిరంజీవి సుముఖతను వ్యక్తం చేశారట. తనకి చిరంజీవి సినిమాల్లో ‘విజేత’ అంటే ఎంతో ఇష్టమనీ, ఆ సినిమాకి సీక్వెల్ ను గానీ .. ఆ తరహాలో గాని మరో సినిమా చేయాలనుందని విష్ణు చెప్పారట.

దాంతో ఇప్పుడు అందరూ ఈ విషయాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్ ఎవరనే విషయంతో పాటు ఇతర వివరాలను ప్రకటిస్తారని చెప్పుకుంటున్నారు. మరి ఈ మూవీ ప్రకటన వచ్చినప్పటికీ తెరపైకి రావడానికి మరికొన్ని నెలలు పట్టడం ఖాయం.