విరూపాక్ష టీజర్‌ టీజర్ వచ్చేసింది

సాయి ధరమ్ తేజ్ – సంయుక్త జంటగా కార్తీక వర్మ దండు డైరెక్షన్లో సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం విరూపాక్ష . ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ గురువారం విడుదలైంది. ఆక్సిడెంట్ తరువాత తేజ్ నటించిన మూవీ ఇది. ఈ సినిమా తాలూకా షూటింగ్ పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ ఫై దృష్టి పెట్టారు. ఇప్పటీకే ఈ సినిమా తాలూకా గ్లింప్స్‌ విడుదల చేయగా మంచి ఆదరణ లభించింది. ఈ గ్లింప్స్‌ కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. గంభీరమైన స్వరంతో అతడు ‘అజ్ఞానం భయానికి మూలం. భయం మూఢ నమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనప్పుడు.. ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు.. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం’ అంటూ పలికిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.

ఇక ఇప్పుడు టీజర్ సైతం అదే రేంజ్ లో ఆసక్తి పెంచింది. ఒక గ్రామంలో ఏదో ఒక సమస్య వస్తుంది. అయితే ఆ సమస్య పరిష్కరించడానికి గ్రామస్తులు అందరూ ఒక నిర్ణయం తీసుకుంటారు. తరువాత అదే గ్రామంలోకి హీరో ఎంట్రీ ఇస్తాడు. ఇక ఆ సమస్యకి గల కారణం వెతికే పనిని హీరో మొదలు పెడతాడు. మరి ఆ గ్రామంలో తలెత్తిన సమస్యని హీరో ఎలా పరిష్కరించాడు అనే పాయింట్ ఈ టీజర్ ద్వారా దర్శకుడు కార్తిక్ దండు చూపించే ప్రయత్నం చేశాడు. మరి ఆ గ్రామంలో తలెత్తిన సమస్య ఏంటి అనేది మనకు ఏప్రిల్ 21 న తెలుస్తుంది. ఆ రోజున ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో కూడా విడుదల చేయనున్నారు. ఈ లోపు మీరు ఈ టీజర్ ఫై లుక్ వెయ్యండి.

YouTube video