సాహసాలు చేస్తున్న విరాట్ కోహ్లీ
ఇన్స్టాలో ఫిట్నెస్ వీడియో పోస్ట్
హామిల్టన్: కోహ్లీ కెప్టెన్సీ చేపట్టాక టీమిండియాలో ఫిట్నెస్ పతాక స్థాయికి చేరింది. నిజం చెప్పాలంటే.. ప్రస్తుతం భారత క్రికెటర్లకి ఉన్న ఫిట్నెస్ క్రికెట్ ప్రపంచంలోని మరే జట్టుకీ లేదు. విరాట్ కోహ్లీ తన అమోఘమైన ఫిట్నెస్తో జట్టు సభ్యుల అందరిలో స్ఫూర్తి నింపుతున్నాడు. విరాట్ స్ఫూర్తితో ఇప్పటికే భారత జట్టులోని ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్ సిక్స్ ప్యాక్ సాధించారు. యువ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, మనీశ్ పాండే, శివమ్ దూబేలు కూడా కోహ్లీని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. కోహ్లీ ఎక్కడికి వెళ్లినా.. తన వ్యాయామంను మాత్రం కొనసాగిస్తూనే ఉంటాడు. టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మూడో టీ20 మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు హామిల్టన్లో ఉన్నారు. హామిల్టన్లో కూడా కోహ్లీ వ్యాయామం చేస్తూ కష్టపడుతున్నాడు. జంపింగ్ చేస్తూ సాహసాలు చేస్తున్నాడు. ఓ డబ్బాను రవీంద్ర జడేజా పట్టుకోగా.. కోహ్లీ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి డబ్బాపైకి దూకాడు. పక్కనే రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. దీనికి సంబందించిన ఓ వీడియోని ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో కోహ్లీ పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/