ల‌డ‌ఖ్‌లో ఘ‌ర్ష‌ణ..ముగ్గురు భారత జవాన్లు మృతి

నిన్న రాత్రి నుంచి భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణ

One Indian Army officer, two jawans killed in Ladakh scuffle

లద్దాఖ్‌: భారత్‌, చైనా జవాన్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చైనా బలగాల కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లు మృతి చెందారు. వీరిలో ఒకరు ఆర్మీ ఆఫీసర్‌.. ఇద్దరు జవాన్లు ఉన్నారు. కాగా రెండు రోజుల నుంచి గాల్వ‌న్ వ్యాలీలో రెండు దేశాల సైనికాధికారులు శాంతి చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తున్నారు. ఒకవైపు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నా.. మ‌రో వైపు రెండు దేశాల సైనికులు బాహాబాహీకి దిగారు. మరోసారి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్ర‌స్తుతం నెల‌కొన్న ఉద్రిక్త వాతావ‌ర‌ణాన్ని త‌గ్గించేందుకు రెండు దేశాల‌కు చెందిన సీనియ‌ర్ సైనిక అధికారులు మ‌ళ్లీ స‌మావేశం అయ్యారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/