రసమయి కాన్వాయి పై దాడిని ఖండించిన వినోద్కుమార్
రసమయి కాన్వాయి పై జరిగిన దాడిని వినోద్కుమార్ ఖండించారు. నిత్యం ప్రజలమధ్యన ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న బాలకిషన్ తెలంగాణ ఉద్యమంలో లక్షల మందిని కదిలించిన గొప్ప కళాకారుడని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎవరూ అడగక ముందే రసమయి చొరవతో తాను గన్నేరువరం మండలాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులపై దాడులు సరికాదని అన్నారు. గుండ్లపల్లి నుంచి వెంకట్రావుపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక వేశామని, సంబంధిత ఫైలు ప్రభుత్వం వద్ద ఉందని అన్నారు.
అంతకు ముందు ఏంజరిగిందంటే..
గుండ్లపల్లిలో రసమయి బాలకిషన్ కాన్వాయ్పై యువకులు చెప్పులతో దాడి చేశారు. డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న యువకులకు సర్ధిచెప్పే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యేపైకి యువకులు దూసుకొచ్చారు. కాగా.. అక్కడి నుంచి వెళ్లిపోయేందకు ప్రయత్నించగా.. ఎమ్మెల్యే కాన్వాయ్పై దాడికి దిగారు. యువకులంతా ఒక్కసారిగా దాడికి దిగటంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. యువకులను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.