రికార్డు స్థాయిలో దుర్గమ్మ ఆదాయం

నవరాత్రుల్లో భాగంగా దుర్గమ్మ ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. నవరాత్రుల్లో అమ్మవారిని దాదాపు 5.75 లక్షల మంది దర్శించుకున్నారు. వాస్తవానికి రోజుకు 10 వేల మందినే అనుమతించాలని ఆలయ అధికారులు భావించినప్పటికీ సాధ్యం కాలేదు. కొవిడ్ ప్రభావం కొంత నెమ్మదించడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫలితంగా గతేడాది కంటే రెట్టింపు ఆదాయం వచ్చింది. నవరాత్రుల్లో మొత్తంగా రూ. 4.08 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. రికార్డు స్థాయిలో 15.79 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. ఫలితంగా రూ. 1.58 కోట్ల ఆదాయం సమకూరింది.

ఆదాయ వివరాలను చూస్తే..

  • ప్రసాదాల రూపంలో రూ. 1.58 కోట్లు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లపై రూ.79.50 లక్షలు, రూ. 100 టికెట్లపై రూ. 64.68 లక్షలు, ప్రత్యేక పూజల ద్వారా రూ. 68.55 లక్షలు, చీరల విక్రయం ద్వారా రూ. 11.37 లక్షలు, కేశఖండనాల ద్వారా రూ. 12.02 లక్షల ఆదాయం సమకూరింది.