చంద్రబాబు మేకతోలు కప్పుకున్న తోడేలు – విజయసాయి

Vijayasai Reddy
Vijayasai Reddy

ఏపీ అసెంబ్లీలో తన ఫై , తన భార్య ఫై వైసీపీ నేతలు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసారని చెప్పుకుంటూ తిరుగుతున్న చంద్రబాబు..మేకతోలు కప్పుకున్న తోడేలు అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీలో చంద్రబాబు భార్య ఫై ఒక్క మాట కూడా అనలేదని ..కావాలనే చంద్రబాబు అబద్దం చెపుతూ ప్రజల సింపతీ రాబట్టుకోవాలని చూస్తున్నారని విజయసాయి అన్నారు. రాజకీయాల్లో లేని తన భార్యను వైసీపీ నేతలు అవమానించారని చంద్రబాబు నాయుడు చెప్పుకోవడంలో వాస్తవం లేదని మరోసారి స్పష్టం చేసారు.

చంద్రబాబు తన పరువు తనే తీసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. వరద ప్రాంతాల సందర్శనను ‘స్వియ ఓదార్పు’ యాత్రగా చంద్రబాబు మార్చారని విమర్శించారు. నష్టపోయిన రైతుల గురించో.. బాధితుల గురించో చంద్రబాబు మాట్లాడుతాడు అనుకుంటే.. మళ్లీ అదే పాట పాడుతున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ఆలోచలన్నీ విషపూరితంగానే ఉంటాయన్నారు. తన అసలు స్వరూపం బయటపడకుండా చంద్రబాబు కంట్రోల్ చేసుకోలేరని అన్నారు. అధికార పీఠానికి తనను దూరం చేసిన జగన్‌పై విషం కక్కడం ఇది మొదటిసారి కాదన్నారు. చివరకు తనను ఓడించిన ప్రజలు కూడా నాశనమైపోవాలని శాపనార్థాలు పెట్టే ఉన్మాద మనస్తత్వం చంద్రబాబుదంటూ విజయసాయి మండిపారు.