కరోనా నుండి కోలుకున్న విజయసాయిరెడ్డి
శ్రేయోభిలాషుల ప్రార్థనలతో ఆరోగ్యం మెరుగుపడింది
అమరావతి: వైఎస్ఆర్సిపి ఎంపి విజయసాయిరెడ్డికి కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. దాదాపు 10 రోజుల తర్వాత ఆయన తొలిసారి ట్వీట్ చేశారు. ‘భగవంతుడి దయతో, శ్రేయోభిలాషుల ప్రార్థనల బలంతో కోలుకున్నాను. అందరికీ కృతజ్ఞుడిని. మానవాళి అస్థిత్వానికి సవాలుగా మారిన కరోనాను ప్రతి ఒక్కరూ జయించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/