యనమలపై విజయసాయి రెడ్డి ఆగ్రహం

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన శాసనసభ బిల్లు ఆమోదించి పంపితే శాసనమండలిలో అప్రజాస్వామికంగా, నిబంధనలకు విరుద్ధంగా అడ్డుకోవడాన్ని వైఎస్సార్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. సభలో టిడిపి సినీయర్‌ నేత యనమల రామకృష్ణుడు అవలంబించిన తీరుపై విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ ద్వారా విమర్శించారు. దివంగత ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచే ప్రణాళికలో భాగంగా అప్పట్లో యనమలని చంద్రబాబునాయుడు స్పీకర్‌గా తెరపైకి తీసుకొచ్చాడని అన్నారు. అదే విధంగా తన బాస్‌ ముఖ్యమంత్రి కావడానికి స్పీకర్‌ స్థానంలో ఉండి యనమల చరిత్రలో నిల్చేంత సేవ చేశారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు శాసనమండలి ప్రతిష్టను కూడా చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం మంటగలిపారని దుయ్యబట్టారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/