విశాఖ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలతో అత్యవసర భేటి

విశాఖలోని ప్రభుత్వ అతిథిగృహంలో విజయసాయి భేటీ

vijaya sai reddy
vijaya sai reddy

విశాఖ: విశాఖ జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు, ఎమ్మెల్యేలతో విజయసాయిరెడ్డి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. విశాఖలోని ప్రభుత్వ అతిథిగృహంలో దాదాపు గంటకు పైగా సమావేశం జరగింది. ఈ భేటీలో తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలపై ముఖ్యంగా చర్చించారు. దీంతోపాటు, ఇతర పార్టీల నుంచి చేరికలపై చర్చలు జరిపారు. ఈ సమావేశానంతరం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లా నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. కొందరు పనికట్టుకుని రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో సంక్షేమ పథకాలపైనే చర్చించామని చెప్పారు. జిల్లాలోని నేతలందరూ సమన్వయంతో పని చేస్తున్నామని అన్నారు. పేదలందరూ బాగుండాలనే ముఖ్యమంత్రి జగన్ ఆశయ సాధన కోసం అందరం కలసి పని చేస్తామని చెప్పారు. మరోవైపు మీడియాలో వచ్చిన వార్తలు, తాజా సమావేశానికి సంబంధించి విజయసాయిరెడ్డి మీడియాముఖంగా మాట్లాడనున్నారని సమాచారం.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/