రాష్ట్రపతికి ఫిర్యాదుల పేరుతో డ్రామా
నేరం చేసిన వారిపై కేసు పెడితే ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్లట..విజయసాయిరెడ్డి
అమరావతి: టిడిపి ఎంపిలు నిన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వైఎస్ఆస్సిపి ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈవిషయంపై వైఎస్ఆర్సిపి ఎంపి విజయసాయిరెడ్డి స్పందించారు. ‘రాష్ట్రపతికి ఫిర్యాదుల పేరుతో పచ్చ బ్యాచ్ ఢిల్లీలో కొత్త డ్రామాలు మొదలెట్టింది. నేరం చేసిన వారిపై కేసు పెడితే ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్లు, అవినీతిపరులను అరెస్ట్ చేస్తే రాజ్యాంగం విఫలం అయినట్లు, శాంతి భద్రతలు క్షిణించినట్లు అట. మీ డ్రామాలు చూసి ఊసరవెల్లులు సిగ్గుపడుతున్నాయి’ అని అన్నారు. కాగా, ఏపీలో టిడిపి హయాంలో అవకతవకలు జరిగాయంటూ విజయసాయిరెడ్డి ఆరోపణలు గుప్పించారు. ‘బడికొస్తా పథకం పేరుతో 1,82,000 సైకిళ్లు బాలికలకు పంపిణీ చేశారట. ఎందరికి అందాయో, ఇచ్చినట్టు రికార్డుల్లో రాశారో దర్యాప్తులో వెల్లడవుతుంది. 3040 ఏళ్ల కిందటి సైకిళ్లు ఇప్పటికీ రోడ్లపైన కనిపిస్తాయి. మూడేళ్లలోనే అమ్మాయిల సైకిళ్ల ఖగంటగలు ఎందుకు మూగబోయాయో శీను మాయ తెలియాల్సి ఉంది’ అని విమర్శించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/