చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం బాబు

vijayasai reddy
vijayasai reddy

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబుపై ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. ‘చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం చంద్రబాబు. వర్తమానం లేదు. భవిష్యత్తు లేదు. తనపై తనే నమ్మకం కోల్పోయిన వ్యక్తి పార్టీ శ్రేణులకు ఏం ధైర్యం ఇవ్వగలడు. తప్పులను సవరించుకునే బదులు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రం నలుచెరుగులా ఏలిన పార్టీని నాలుగు గ్రామాలకు పరిమితం చేశాడని’ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తనపై తను నమ్మకం కోల్పోయిన వ్యక్తి పార్టీ శ్రేణులకు ఏం నమ్మకం ఇవ్వగలడని ప్రశ్నించారు. ‘లచ్చల్ లచ్చల్ ఇళ్లు తామే నిర్మించేశాం.   పంపిణీ మర్చిపోయాం అంటున్నాడు CBN. నీవు ఇళ్లు నిర్మిస్తే పచ్చ బ్యాచ్ కు పంచకుండా ఉంటావా బాబూ?  లేని నగరాన్నే గ్రాఫిక్స్ లో సృష్టించి వాటాలు పంచినోడివి.  బొంకరా బొంకరా బాబు అంటే కరోనా వ్యాక్సిన్ తానే తయారు చేశానన్నాడంట’ అని ఆయన ఎద్దేవా చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/