బాబు మంగమ్మ శపథం ఏమైంది..ఒట్టు తీసి గట్టున పెట్టాడు అంటూ విజయసాయి సెటైర్లు

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సందర్బంగా టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీ లో అడుగుపెట్టాడని…వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. సీఎం అయ్యేదాకా అసలు అసెంబ్లీ గడప తొక్కనని బాబు మంగమ్మ శపథం చేశాడని, ఇప్పుడా ఒట్టు తీసి గట్టున పెట్టేసి అసెంబ్లీకి వెళ్లి ఓటు వేశాడని సెటైర్లు వేశారు.

అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకున్న తరువాత చంద్రబాబు అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. టీడీపీ కార్యాలయంలో సమావేశమైన పార్టీ ఎమ్మెల్యేలు కలిసి అసెంబ్లీకి చేరుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు అసెంబ్లీలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో చివరి నిమిషంలో అనూహ్యంగా ఎన్డీఏ అభ్యర్ధి ముర్ముకు చంద్రబాబు ప్రకటించడం జరిగింది. ప్రకటించినట్లే టీడీపీ నేతలు ముర్ముకు ఓటు వేశారు.

అయితే చంద్రబాబు అసెంబ్లీ లో అడుగుపెట్టడం ఫై విజయసాయి ట్విట్టర్ ద్వారా స్పందించారు. సీఎం అయ్యేదాకా అసలు అసెంబ్లీ గడప తొక్కనని బాబు మంగమ్మ శపథం చేశాడని, ఇప్పుడా ఒట్టు తీసి గట్టున పెట్టేసి అసెంబ్లీకి వెళ్లి ఓటు వేశాడని విజయసాయి అన్నారు. ఇక సీఎం కాలేనని చంద్రబాబుకు స్పష్టత వచ్చిందని విమర్శించారు. ఈ మేరకు చంద్రబాబు ఓటు వేసిన వీడియోను, గతంలో చంద్రబాబు ప్రెస్ మీట్ లో విలపించిన దృశ్యాలను కలిపి ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.