ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు కన్నా?

కన్నా లక్ష్మీనారాయణ పై విజయసాయిరెడ్డి విమర్శలు

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్షీనారాయణమూడు రాజధానుల బిల్లును ఆమోదించవద్దని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కి లేఖ రాయడం పై వైఎస్‌ఆర్‌సిపి ఎంపి వియసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు కోవర్టు అని మళ్లీ స్పష్టమైంది. సొంత పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబుకి అనుకూలంగా రాజధాని బిల్లు ఆమోదించవద్దని గవర్నర్ గారికి లేఖ రాశారు. దీనితో పార్టీ అధిష్ఠానం ఆగ్రహానికి కూడా గురయ్యాడు. ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు కన్నా?’ అని విమర్శించారు. ‘బాబుతో భౌతిక దూరం పాటించాలని రాష్ట్ర బిజెపిని జాతీయ నాయకత్వం హెచ్చరించినా టీడీపీ లైన్ లోనే లేఖలు రాస్తున్నారు. కరోనా టైంలోనైనా సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే ఎలా కన్నా? బిజెపి స్టేట్ ఇన్‌చార్జీ కూడా రాజధానులు రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం అన్నారుగా కన్నా. ఓహో ఇదంతా నీ పచ్చ స్వామిపై భక్తా?’ అని విజయసాయిరెడ్డి నిలదీశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/