చంద్రబాబును ఎద్దేవా చేసిన విజయసాయిరెడ్డి
నల్ల చొక్కా వేసుకున్న చంద్రబాబు ఫొటోను పోస్ట్ చేసి విమర్శలు
అమరావతి: నేడు జరుగుతున్న ఏపి అసెంబ్లీ సమావేశాలకు టిడిపి నేతలు నల్లచొక్కాలతో హాజరైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అసెంబ్లీకి వెళ్లారు. ఆయన కూడా నల్ల చొక్కా వేసుకున్న ఫొటోను వైఎస్ఆర్సిపి ఎంపి విజయసాయిరెడ్డి పోస్ట్ చేసి విమర్శలు గుప్పించారు. ‘నల్ల ధనం మీద విచారణ వద్దని నల్ల చొక్కా వేసుకున్నావా? నాయుడూ వాటే కలర్సెన్స్!’ అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. కాగా, ఏడాది కాలంగా ఏపిలో ప్రభుత్వ తీరుకి నిరసనగా టిడిపి ఎమ్మెల్యేలు, నేతలు నల్లచొక్కాలు వేసుకుని ఈ రోజు పలు ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/