దీపావళికి విజయ్ ‘వారసుడు’ ఫస్ట్ సింగిల్

విజయ్ – రష్మిక జంటగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం వారసుడు. తెలుగు , తమిళ్ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ తాలూకా ఫస్ట్ సింగిల్ ను దీపావళి సందర్బంగా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తమిళంలో ఈ సినిమాకి ‘వరిసు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. విజయ్ జోడీగా ఫస్టు టైమ్ రష్మిక అలరించనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది.

విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నడవనుంది. తమన్ స్వరపరిచిన పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా ఇంతకుముందే తెలుపడం జరిగింది. ‘బీస్ట్’ తరువాత విజయ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ అంచనాలకి ఎంత దగ్గరగా ఈ సినిమాను వంశీ పైడిపల్లి తీసుకుని వెళతాడనేది చూడాలి.