అశోక్ గజపతి రాజుపై మండిపడ్డ విజయసాయిరెడ్డి
అశోక్గజపతిరాజు గారు మాన్సాస్ చైర్మన్గా ఉండగా అవినీతి
అమరావతి: అశోక్ గజపతిరాజు పై వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పలు ఆరోపణలు చేశారు. ‘అశోక్ గజపతిరాజు గారు మాన్సాస్ చైర్మన్గా ఉండగా 2016లో ప్రభుత్వం నుంచి ఒక దొంగ జీవో తీసుకొచ్చి 115 ఎకరాలను చట్టవిరుద్ధంగా అమ్మేశారు. 2010 లోనూ 500 పైగా ఎకరాలను కాజేశారు. వీటన్నింటిపైనా విచారణ జరిపిస్తాం’ అని విజయసాయిరెడ్డి చెప్పారు.
కాగా, గతంలో సంచయిత గజపతిరాజును ఛైర్పర్సన్గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇటీవల హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్గా పునర్నియమించాలని పేర్కొంది. దీంతో మాన్సాస్ ఛైర్మన్గా అశోక్ గజపతిరాజు బాధ్యతలు స్వీకరించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/