పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరారన్న రజని

పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరారంటూ ఏపీ మంత్రి విడదల రజని విమర్శలు చేసారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. జనసేన vs వైస్సార్సీపీ గా మారింది. వైస్సార్సీపీ నేతలపై దాడి చేసారని జనసేన కార్య కర్తలను అరెస్ట్ చేయడం , పవన్ కళ్యాణ్ పర్యటన ను వైస్సార్సీపీ అడ్డుకోవడం వంటివి ఉద్రికత్త పరిస్థితులకు దారితీసాయి. ఈ క్రమంలో మంగళవారం జనసేన అధినేత పవన్ మీడియా సమావేశం ఏర్పటు చేసి వైస్సార్సీపీ నేతలను హెచ్చరించారు. . ‘నా కొడకల్లారా.. మీకు మాములుగా ఉండదు.. సన్నాసుల్లారా.. వెధవల్లారా..ఏంట్రా మీరు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ‘ అంటూ వైస్సార్సీపీ నేతలపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ఫై వైస్సార్సీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే పలువురు పవన్ ఫై విమర్శలు చేయగా..తాజాగా మంత్రి విడదల రజని పలు విమర్శలు చేసారు. పవన్ కల్యాణ్ లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి రాజకీయాలకు పనికిరారని అన్నారు. వైసీపీ నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పారు. మతిభ్రమించి ఏదేదో మాట్లాడినట్టున్నారని వ్యాఖ్యానించారు. ఒకేసారి రెండు నియోజవర్గాల్లో ఓడిపోయినా ఆయనకు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. పవన్ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారిని ఈదినట్టే ఉంటుందని… ఈ విషయం ఇప్పుడు జనసేన కార్యకర్తలకు కూడా అర్థమయిందని అన్నారు. పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ ఇంతకాలం ముసుగు వేసుకుని ఉన్నారని… ఇప్పుడు ముసుగులు తొలగించి బయటకు వచ్చారని విమర్శించారు.