పవన్ – చంద్రబాబు భేటీ ఫై మంత్రి రజని విమర్శలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ – చంద్రబాబు ల భేటీ ఫై వైస్సార్సీపీ నేతలు వరుసగా విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఈ భేటీ ఫై పలు విమర్శలు చేయగా..తాజాగా మంత్రి విడదల రజిని తీవ్రస్థాయి లో మండిపడ్డారు. కందుకూరు, గుంటూరు లలో టీడీపీ సభల్లో తొక్కిసలాట ఘటనలలో ప్రాణాలు కోల్పోయిన వారిని పరామర్శించకుండా.. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని పరామర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు. వీరి ఇద్దరి పేర్లు మాత్రమే వేరని.. ఇద్దరూ ఒకటేనని అన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని పార్టీలు కలసి వచ్చినా రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ వెంటే ఉంటారని ధీమా వ్యక్తం చేసారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి బాబు ను పవన్ కలిశారు. ప్రస్తుతం ఏపీలో జీవో 1 ను జగన్ సర్కార్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవో ప్రకారం బహిరంగ సమావేశాలు , సభలు , ర్యాలీలకు పలు ఆంక్షలు విధించారు. పార్టీల నేతలు ఏంచేయాలన్న పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందే. వారు ఎక్కడ సభ పెట్టమంటే..అక్కడ పెట్టాలని లేదంటే లేదని ఆంక్షలు విధించారు.

ఈ తరుణంలో చంద్రబాబు కుప్పం పర్యటన ను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ విషయమై పవన్ ఆదివారం చంద్రబాబు ను కలిసినట్లు తెలుస్తుంది. సమావేశం అనంతరం మీడియాతో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడారు. కుప్పం లో జరిగిన సంఘటన పై కలిశామని.. వైస్సార్సీపీ అరాచకాలపై మాట్లాడుకున్నామన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు హక్కు అని.. కానీ అడ్డుకుంటున్నారు..ఏపీలో వైస్సార్సీపీ అరాచక పాలన జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. బ్రిటిష్ కాలం నాటి జీవో తెచ్చారని జగన్ తీరు మండిపడ్డారు. వైస్సార్సీపీ తెచ్చినవి.. చెత్త జోవో లు వీటికి బ్రేక్ వేయాలన్నారు పవన్‌ కళ్యాణ్‌. వైజాగ్ లో కూడా నన్ను అడ్డుకున్నారని ఆగ్రహించారు.