వివాహ బంధంతో ఒకటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

గత కొద్దీ నెలలుగా ప్రేమ పక్షుల్లాగా స్వేచ్ఛగా విహరించిన బాలీవుడ్ జంట విక్కీ కౌశల్-కత్రినా కైఫ్​లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గురువారం రాజస్థాన్​లోని సెవెన్​సెన్స్​ ఫోర్ట్​లో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు , స్నేహితులు , సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ వివాహ ఘట్టంలో భర్త విక్కీ కౌశల్‌ మెడలో పూల మాల వేస్తున్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నది కత్రినాకైఫ్‌. ‘ హృదయాల్లోని ప్రేమ, పరస్పర విశ్వాసం ఈ అందమైన క్షణాల వరకు మమ్మల్ని నడిపించింది . మేము ఇద్దరం కలిసి ఆరంభిస్తున్న ఈ సరికొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు, దీవెనలను కోరుతున్నాం’ అంటూ పేర్కొన్నది. ఈ కొత్త జంటకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.