నేడు ముచ్చింతల్ కు రానున్న ఉపరాష్ట్రపతి

హైదరాబాద్: ముచ్చింతల్ లో రామానుజాచార్యుల స‌హ‌స్రాబ్ధి ఉత్స‌వాలు నేటితో 11వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు భార‌త ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు రామానుజా చార్య‌లు విగ్ర‌హాన్ని ద‌ర్శించుకోనున్నారు. సాయంత్రం 6 :30 గంట‌ల‌కు ముచ్చింతల్ కు చేరుకుంటారు. చిన్న జీయ‌ర్ స్వామితో కలిసి ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు స‌మ‌తా మూర్తి కేంద్రాన్ని సంద‌ర్శిస్తారు. అనంత‌రం రామానుజా చార్యుల 3డీ మ్యాపింగ్ ను చూస్తారు. అలాగే స‌మ‌తా మూర్తి కేంద్రంలో ఉన్న 108 దేవాల‌యాల న‌మూనాను ద‌ర్శించుకుంటారు.

కాగా, శుక్ర‌వారం స‌మ‌తా మూర్తి కేంద్రంలో యోగా గురు రాందేవ్ బాబాతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సంద‌డి చేశారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఈ ఉత్స‌వాల్లో పాల్గొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/