బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలంగాణ ప్రజలకు ‘బతుకమ్మ’ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల్లో అమ్మవారిని ప్రకృతి శక్తిగా ఆరాధించే సంప్రదాయం నుంచి బతుకమ్మ పండుగ పుట్టిందని, కరోనా నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని సూచించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. ‘ప్రకృతితో మమేకమై జరుపుకునే ఖబతుకమ్మగ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు. మన జీవసృష్టికి ప్రకృతే మూలం. అలాంటి ప్రకృతిని కాపాడుకుంటూ, సంస్కృతిని పాటిస్తూ ముందుకెళ్తేనే పురోగతి సాధ్యమని నేను బలంగా విశ్వసిస్తాను. నవరాత్రుల్లో.. అమ్మవారిని ప్రకృతిశక్తిగా ఆరాధించే సంప్రదాయం నుంచి పుట్టిన ఈ బతుకమ్మ పండుగలో కులాలకు అతీతంగా అందరూ ఉత్సాహంగా పాలుపంచుకోవడం ఓ చక్కటి సంప్రదాయం. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ బతుకమ్మను జరుపుకోవాలని సూచిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/