అఖండ యాక్టర్ కన్నుమూత

చిత్రసీమలో వరుస విషాదాలు ఆగడం లేదు. ప్రతి రోజు ఏదొక ఇండస్ట్రీ లో ఎవరో ఒకరు కన్నుమూస్తున్నారు. ఇప్పటికే పలువురు పలు కారణాలతో తుది శ్వాస విడువగా..తాజాగా కన్నడ పరిశ్రమలో ఫేమస్ యాక్టర్ కన్నుమూశారు. ప్రముఖ నటుడు లోహితస్వ ప్రసాద్ కన్నుమూశారు.

గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లోహితస్వ ప్రసాద్ మంగళవారం బెంగుళూరులోని ప్రైవేట్‌ హస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచాడు. ఈయన మరణం పట్ల కన్నడ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. 500 కన్నడ సినిమాలు అలాగే పలు సీరియల్స్ లో నటించిన ప్రసాద్.. ఏకే 47, దాదా దేవా లాంటి సినిమాల్లో ప్రసాద్ నటించారు.

అఖండ సినిమాలో NIA అధికారి పాత్రలో ప్రసాద్ కొడుకు నటించారు. అరవింద సమేత అలాగే జై లవకుశ లాంటి సినిమాలో కూడా ప్రసాద్ కొడుకు నటించారు. ఇండస్ట్రీకి రాకముందు లోహితస్వ ప్రసాద్‌ ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌గా పనిచేసేవాడు. ‘అంతిమ రాజా’, ‘గ్రుహంబంగ’, ‘మాల్గుడి డేస్‌’ వంటి సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులలో కూడా అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఈయన కొడుకు శరత్‌ లోహితస్వ కూడా నటుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చకున్నాడు.