చైతు – సామ్ విడాకులపై వెంకీ ట్వీట్

నాగ చైతన్య – సమంతలు తాము విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన రాగానే అంత షాక్ లో పడ్డారు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు , సినీ ప్రేక్షకులు ఈ వార్త అబద్దమైతే బాగుండని అనుకున్నారు. సోషల్ మీడియా లో , మీడియా చానెల్స్ లలో ఈ విడాకుల గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ విడాకుల ఫై ఇప్పటికే నాగార్జున, సమంత తండ్రి తో పాటు పలువురు సినీ ప్రముఖులు స్పందించగా..తాజాగా వెంకటేష్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ సెటైరికల్ పోస్ట్ చేశారు. ‘మనం ఏదైనా విషయంపై పెదవి విప్పే ముందు దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి’ అంటూ వెంకీ పెట్టిన పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ పోస్ట్ సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజా పరిస్థితులకు అనుగుణంగానే ఆయన ఈ పోస్ట్‌ పెట్టారా? అని అందరూ మాట్లాడుకుంటున్నారు.

‘ఏం మాయ చేశావే’ సినిమాతో నాగచైతన్య, సమంత జోడి కట్టారు. ఆ తర్వాత ‘మనం’, ‘ఆటోనగర్ సూర్య’ , మజిలీ సినిమాల్లో వీరు జంటగా కనిపించి ప్రేక్షకులను అలరించారు. తొలి సినిమాతోనే ప్రేమలో పడిన వీరు.. 2017లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి టాలీవుడ్‌లో లవ్లీ కపుల్‌గా వీరిద్దరు నిలిచిపోయారు. పెళ్లి తర్వాత కూడా సమంత నటించిన ‘ఓ బేబీ’ సినిమాలో చై ఓ ప్రత్యేక పాత్రలో కనిపించగా.. 2019లో వీరిద్దరు కలిసి ‘మజిలీ’ అనే సినిమాలో భార్య భర్తలుగా నటించారు.