ఎల్జీ పాలిమర్స్ వద్ద గ్రామస్థుల ధర్నా
పరిశ్రమను వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్
విశాఖ: విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుండి గ్యాస్ లీక్ కావడంతో వెంకటాపురం గ్రామానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆ గ్రామస్థులు ఎల్జీ పాలిమర్స్ వద్ద ఆందోళనకు దిగారు తమకు న్యాయం చేయాలంటూ పరిశ్రమ వద్ద ధర్నా చేస్తున్నారు. అలాగే, ఆ పరిశ్రమను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ పరిశ్రమను ఇక్కడ నుంచి తరలించే వరకు తమ ఆందోళనను విరమించబోమని గ్రామస్థులు మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వందలాది మంది స్థానికులు పరిశ్రమ వద్దకు చేరుకుంటున్నారు. తమను అడ్డుకుంటున్న పోలీసులతో స్థానికులు వాగ్వివాదానికి దిగారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/