ప్రియాంక గాంధీ తో భేటీ అనంతరం మీడియా తో మాట్లాడిన వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..ఈరోజు ఢిల్లీలో ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. అధిష్టానం నుండి పిలుపు రావడంతో ఉదయం ఢిల్లీ వెళ్లిన వెంకట్ రెడ్డి..ప్రియాంక తో భేటీ అయ్యి..రాష్ట్రంలోని పరిస్థితులను ప్రియాంక కు తెలిపారు. మొన్న ఓ ఫంక్షన్ ఉన్న కారణంగా.. తాను సమావేశానికి రాలేకపోయానని ..అందుకే ప్రియాంక గాంధీ ప్రత్యేకంగా టైం ఇచ్చి తనను కలిసినట్టు తెలిపారు.

ప్రియాంక గాంధీతో చాలా విషయాలపై చర్చించినట్టు.. వెంకట్ రెడ్డి వెల్లడించారు. పార్టీ బలోపేతం గురించి తాను కొన్ని సలహాలు ఇచ్చానని .. ఏ సమస్య ఉన్న తన దగ్గరికి రావాలని ప్రియాంక సూచించినట్టు చెప్పారు. ఒక 10 రోజులు తాను అందుబాటులో ఉండనని.. వచ్చాక పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానని చెప్పినట్టు వెల్లడించారు. భారత్ జోడో యాత్ర సహా.. రాష్ట్ర పరిస్థితుల గురించి అర్థవంతంగా చర్చ జరిగిందని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.