మనుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటన

మనుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించి కార్యకర్తల్లో ఆనందం నింపారు. మొన్నటికి మొన్న ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లానని తేల్చి చెప్పిన వెంకట్ రెడ్డి..నిన్న ప్రియాంక గాంధీ తో భేటీ అయ్యారు. ఈ భేటీ లో నేతలతో కలిసి ఉండాలని..ఏమైనా సమస్యలు ఉంటె అధిష్టానికి తెలుపాలని ప్రియాంక సూచించారు. ఈ తరుణంలో ఈరోజు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో తన నివాసంలో భేటీ అయ్యారు.

మునుగోడు ఉపఎన్నిక.. పార్టీలో తాజా రాజకీయ పరిణామాలు..అభ్యర్థి ఎంపిక వంటి అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా మనుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో తన అభిప్రాయాలను భేటీ కి తెలిపినట్లు వెంకట్ రెడ్డి తెలిపారు. ఎవరి పేరు సూచించానో చెప్పలేనని..అది పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రియాంక గాంధీ ప్రకటిస్తారని చెప్పుకొచ్చారు. ఇక వారం రోజుల్లో మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో ఉప ఎన్నిక అనివార్యమైంది. రీసెంట్ గా రాజగోపాల్ బిజెపి లో చేరి..బిజెపి నుండి బరిలోకి దిగబోతున్నాడు. మరి టిఆర్ఎస్ నుండి ఎవరు బరిలో దిగుతారనేది తెలియాల్సి ఉంది.