ఏపీలో కర్ఫ్యూ కారణంగా సరిహద్దుల్లో నిలిచిపోయిన వాహనాలు

ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు అమలు

Vehicles-stopped-at-borders-

ఏపీలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు కారణంగా తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వాహనాలు సరిహద్దుల వద్ద స్తంభించిపోయాయి. నల్గొండ జిల్లాలోని ఏపీ సరిహద్దులైన గరికపాడు, వాడపల్లి చెక్‌పోస్టుల వద్ద వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఏపీలో మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉండటంతో ఎటువంటి వాహనాలను అనుమతించేది లేదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కర్ఫ్యూ నుంచి పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు మాత్రమే మినహాయింపు వున్నా విషయం తెలిసిందే.విమాన, రైల్వే ప్రయాణాలకు టిక్కెట్లు చూపించేవారిని, అత్యవసర సేవలు వినియోగించుకునే వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/