గుడిమల్కాపూర్ మార్కెట్ లో అధిక ధరలకు కూరగాయలు

ధరలకు రెక్కలు

Vegitables

Hyderabad: నిత్యావసరాలు, పాలు, కూరగాయల ను జనతా కర్ఫ్యూ నుంచి మినహాయించిన సంగతి తెలిసిందే. గుడిమల్కాపూర్ మార్కెట్ లో వినియోగదారులను వ్యాపారులు నిలువుదోపిడీ చేశారు.

మొన్నటి వరకు కిలో 30 రూపాయలు పలికిన బెండకాయల ధర ఈ రోజు కిలో 120 రూపాయలు పలుకుతున్నాయి

దొండకాయలు కిలో 90 రూపాయలు, బీర కాయలు కిలో 100 రూపాయలు, చిన్న కొత్తిమీర కట్ట 10 రూపాయలు, వంకాయలైతే ఏకంగా 110 రూపాయలు చొప్పున విక్రయించారు.

ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/