ఒంగోలు లో వీరసింహ రెడ్డి ప్రీ రిలీజ్ వేడుక

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహరెడ్డి చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 06 న ఒంగోలు లో భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. నందమూరి బాలకృష్ణ , శృతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న మూవీ వీరసింహారెడ్డి. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా పోస్టర్స్ , టీజర్స్ , సాంగ్స్ ఇలా అన్ని సినిమా ఫై అంచనాలు పెంచేయగా..ఇక సినిమా తాలూకా ప్రీ రిలీజ్ వేడుక ను ఒంగోలులోని ఎ.ఎమ్.బి. కాలేజ్ గ్రౌండ్స్ లో, ఈ నెల 6వ తేదీన ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలుకానుంది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో, ప్రతి నాయకుడిగా దునియా విజయ్ కనిపించనున్నాడు. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ .. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. అఖండ తర్వాత బాలకృష్ణ నుండి వస్తున్న సినిమా కావడం , క్రాక్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న గోపీచంద్ మలినేని వీరిద్దరి కలయిక లో ఈ సినిమా వస్తుండడం తో అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. మరి ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందా లేదా అనేది చూడాలి.