డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు..
‘వరుడు కావలెను ‘ యూనిట్ సన్నాహాలు
నాగ శౌర్య, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం వరుడు కావలెను. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించడం జరిగింది. విశాల్ చంద్రశేఖర్ తో పాటుగా ఈ చిత్రం కోసం థమన్ సంగీతం అందించడం విశేషం. నవీన్ నూలీ ఎడిటర్ గా వ్యవహరించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. జీ 5 వేదిక గా ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది. జనవరి 7 వ తేదీన వస్తుండగా, ఇందుకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా జీ 5 తెలుగు విడుదల చేయడం జరిగింది. థియేటర్ల లో ఆకట్టుకున్న ఈ చిత్రం జీ 5 లో ఏ తరహాలో ఆకట్టుకుంటుందొ చూడాలి.
అంతర్జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/international-news/