ఎవరెన్ని ఎత్తులు వేసినా వచ్చే ఎన్నికల్లో టిడిపిదే విజయంః వర్ల

టిడిపి కార్యాలయంపై ప్రభుత్వమే దాడి చేయించింది.. వర్ల రామయ్య

varla ramaiah
varla ramaiah

అమరావతిః టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నేడు గన్నవరం వచ్చారు. ఇటీవల దాడికి గురైన టిడిపి కార్యాలయాన్ని పరిశీలించారు. గన్నవరంలో టిడిపి ఆఫీసుపై ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా దాడి చేయించిందని వర్ల రామయ్య ఆరోపించారు. దాడి చేస్తారని ఎస్పీ, ఇతర పోలీసు అధికారులకు ముందే తెలుసని అన్నారు. పోస్టింగ్ ఇవ్వరన్న భయంతోనే ఎస్పీ అన్ని విషయాలు దాచిపెడుతున్నారని పేర్కొన్నారు.

ఎవరెన్ని ఎత్తులు వేసినా వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు, అవినీతితోనే వైఎస్‌ఆర్‌సిపి పాలన సాగుతోందని వర్ల రామయ్య విమర్శించారు.