జూన్‌ 10న వందేభారత్ మిషన్ మూడో విడత ప్రారంభం

మూడో విడతకు 337 విమానాలు సిద్ధం

Air India's B747 Plane Departs From Delhi To Wuhan
Air India

న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం లాక్‌డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశం రప్పించేందుకు చేపట్టిన ‘వందేభారత్ మిషన్’ చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే రెండు విడతలు ముగిశాయి. అయితే ఇప్పుడు జూన్ 10న మూడో విడత మిషన్‌ ప్రారంభంకానుంది. ఈ మూడో విడత మిషన్‌లో భాగంగా 31 దేశాల్లో చిక్కుకుపోయిన దాదాపు 38 వేల మందిని 337 విమానాల ద్వారా స్వదేశానికి తరలించనున్నారు. వీటిలో 54 విమానాలు అమెరికా, 24 కెనడా, నైజీరియా, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, కెన్యా, సీషెల్స్, మారిషస్ నుంచి 11 విమానాలు రానున్నాయి. మరోవైపు, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ నుంచి సరిహద్దు ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ల ద్వారా దాదాపు 32 వేల మంది భారత్ చేరుకున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.
కాగా రెండు విడతల ద్వారా ఇప్పటి వరకు 1,07,123 మంది స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో 17,485 మంది వలస కార్మికులు, 11,511 మంది విద్యార్థులు, 8,633 నిపుణులు శ్రీవాస్తవ తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/