వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మరోసారి ప్రమాదం

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ కు వరుస ప్రమాదాలు ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేస్తుంది. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగోసారి ప్రమాదం జరగడం తో అంత షాక్ అవుతున్నారు. ఇండియన్ రైల్వేస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గాంధీనగర్-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరోసారి ప్రమాదానికి గురైంది. గురువారం సాయత్రం గుజరాత్‌లోని ఉద్వాడ మరియు వాపి స్టేషన్ల మధ్య పశువులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో రైలు ముందు భాగానికి చిన్నపాటి డెంట్ ఏర్పడింది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలు ప్రారంభం అయిన తర్వాత ప్రమాదం జరగడం ఇది నాలుగోసారి. ఉద్వాడ- వాపి మధ్య లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 87 సమీపంలో ఈ సంఘటన జరిగిందని పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ చెప్పారు.కొద్దిసేపు ఆగిన తర్వాత రైలు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించింది.

రెండు నెలల క్రితం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ సేవలు ఆరంభం అయ్యాయి. ఈ రెండు నెలల్లో నాలుగు సార్లు రైలు ట్రాకుపైకి వచ్చిన పశువులను ఢీకొట్టింది. తాజాగా మరోసారి అలాంటి ఘటనే పునరావృతం అయింది. అంతకుముందు ట్రైన్ గేదెలను ఢీకొట్టింది. అప్పుడు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. అప్ప్పుడు వందేభారత్ ట్రైన్‌పై ట్రోలింగ్ నడిచింది. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే ప్రమాదం జరిగిన ఒక్క రోజులోనే దీనికి మరమ్మత్తులు చేసింది రైల్వే శాఖ. సెప్టెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ గాంధీ నగర్లో ఈ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు.