బాబు లో ఆ దమ్ములేకే ఈ ధర్నాలు – వల్లభనేని వంశీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ధర్నాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో చంద్రబాబు ఫై వల్లభనేని వంశీ నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ ధరలను పెంచిందని సెస్ పేరుతో కోట్లాది రూపాయలను వసూలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను కూడా కేంద్రం ఇవ్వడంలేదని వల్లభనేని వంశీ అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కేంద్రాన్ని నిలదీసే దమ్ము ధైర్యం చంద్రబాబుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన వల్లభనేని వంశీ చంద్రబాబుకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ధర్నాలు చేయాలంటూ చంద్రబాబు కొత్త నాటకానికి తెర తీశాడు అని వంశీ అన్నారు. చంద్రబాబు కొంగ జపాలు నమ్మడానికి జనం సిద్ధంగా లేరని ఆయన పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసినా బద్వేలు లో డిపాజిట్ కూడా రాలేదని వల్లభనేని వంశీ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని వల్లభనేని వంశీ ఎద్దేవా చేశారు.