వైశాలి కిడ్నాప్ కేసు : అసలు నిజం తెలిపిన నవీన్ రెడ్డి

ఆదిభట్ల యువతీ వైశాలి కిడ్నాప్ లో నిందితుడు నవీన్ రెడ్డి అసలు నిజం తెలిపాడు. ఆదిభట్ల యువతీ కిడ్నాప్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రాగన్నగూడకు చెందిన వైశాలి ని గత కొద్దీ రోజులుగా నవీన్ రెడ్డి అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో వైశాలి ఇంట్లో పెండ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం వైశాలి కి పెండ్లి చూపులు ఏర్పాటు చేయగా..ఇది తెలుసుకున్న నవీన్‌ రెడ్డి అనే యువకుడు వందమంది యువకులతో కలిసి సదరు యువతి ఇంటికి వచ్చి దాడి చేశాడు. అనంతరం యువతిని బలవంతంగా లాక్కెళ్లారు. ఆ తర్వాత పోలీసులు వైశాలిని క్షేమంగా ఇంటికి చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలు కు తరలించగా..ప్రధాన నిందితుడు నవీన్ ను గోవా లో అరెస్ట్ చేశారు.

అదుపులోకి తీసుకున్న పోలీసులకు గంటకో కథ చెపుతూ నమ్మించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు నవీన్. మొన్న ప్రేమించుకున్నామన్నాడు.. నిన్న పెద్దలతో కలిసి టూర్లు వేశామన్నాడు.. ఆ తరువాత వైశాలిదే తప్పంతా అని నమ్మించాలని కుట్రలు పన్నాడు.. ఇప్పుడు తాజాగా అసలు నిజం చెప్పుకొచ్చాడు. వైశాలితో తన పెళ్లి తాను ఆడిన నాటకమని ఒప్పుకున్నాడు. వైశాలికి కుదిరిన పెళ్లిని తప్పించేందుకే తానీ ప్రయత్నం చేశానన్నాడు నవీన్‌రెడ్డి పోలిసుల ఎదుట ఒప్పుకున్నాడు. తన మనుషులతోనే వైశాలి ఇంటిపై దాడిచేయించానన్నాడు… పెళ్లి చేసుకోలేదనే కోపంతో కిడ్నాప్‌ చేశానన్నాడు. పక్కాప్లాన్‌తో జరిగిన ఈ కిడ్నాప్‌ ఇష్యూ పెద్దది కావడంతో భయపడి..రుబెన్‌ సాయంతో గోవా పారిపోయినట్లు పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు.