రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ప్రమాణస్వీకారం

హైదరాబాద్: టీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర ఈరోజు ఉదయం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రవిచంద్రతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. రవిచంద్ర తెలుగులో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కే కేశవరావు, లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వరరావు, మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీలు బండ ప్రకాశ్ ముదిరాజ్, తాత మధు హాజరయ్యారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/