ఏపీ లో కొనసాగుతున్న మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్

ఇవాళ ఒక్కరోజులోనే 8 -10 లక్షల డోసులు ఇవ్వాలని నిర్ణయం

covid vaccination
covid vaccination

Amaravati: ఏపీ లో ఇవాళ రికార్డు స్థాయిలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే 8- 10 లక్షల మందికి టీకాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. వైద్యఆరోగ్య శాఖ నేతృత్వంలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలకు లక్ష చొప్పున.. మిగతా జిల్లాలకు 50- 70 వేల డోస్‌లను పంపారు. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులు రాష్ట్రంలో సుమారు 18 లక్షల మంది ఉండగా.. శనివారం వరకు వీరిలో 28% మంది తొలి డోస్ వేయనున్నారు.

మిగతావారిలో సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించింది. అలాగే 45 ఏళ్లు బడిన వారికి తొలి టీకా వేస్తారు. రెండో డోసుకు అర్హత కలిగిన వారికి కూడా వ్యాక్సిన్‌ వేయించుకునే అవకాశాన్ని వీలైనంత వరకు కల్పించాలని అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఒక్కో జిల్లాలో కనీసం 500 వ్యాక్సిన్‌ పంపిణీ కేంద్రాలు ఏర్పాటుచేశారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/