యూపీలో 12 వేల జంటలకు సామూహిక వివాహాలు

వధువుల ఖాతాల్లో రూ. 35 వేల చొప్పున జమ
వరకట్న దురాచారాన్ని రూపుమాపేందుకేనన్న మంత్రి

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సామూహిక వివాహాల్లో వేలాదిమంది జంటలు ఒక్కటయ్యాయి. రాష్ట్రంలోని 60 జిల్లాల్లో జరిగిన ఈ సామూహిక పెళ్లిళ్ల ద్వారా 12 వేల జంటలు వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి. మతాలకు అతీతంగా జరిగిన ఈ వివాహాల సందర్భంగా ప్రభుత్వం ఒక్కో వధువు ఖాతాలో రూ. 35 వేల చొప్పున జమ చేసింది.

రెండో విడత సామూహిక వివాహాలు ఈ నెల 17న నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. లక్నోలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అసిం అరుణ్ మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు చేయూత ఇవ్వడంతోపాటు వరకట్న దురాచారానికి అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం ఈ సామూహిక వివాహ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/