సైకిల్‌ పై కార్యాలయానికి రాష్ట్ర మంత్రి

సైకిల్‌పై వెళ్లి అధికారులతో భేటీ

UP minister Srikanth Sharma cycles to work for ‘green’ cause

లఖ్‌నవ్యూ: ఉత్తర్‌ ప్రదేశ్‌ విద్యుత్‌ శాఖ మంత్రి శ్రీకాంత్‌ శర్మ తన కార్యాలయానికి సైకిల్‌ మీద వెళ్లడం ప్రారంభించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. తాను చేసే పనుల ద్వారానే ప్రజలకు సందేశమిస్తున్నారు. తన కార్యాలయానికి సైకిల్‌ మీద వెళ్లారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణను గురించిన అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు. బంగ్లా బజార్‌, ఆషియానా ప్రాంతాల్లోని విద్యుత్‌ సబ్‌సెంటర్లకు కూడా ఆయన సైకిల్‌ పైనే వెళ్లి అక్కడ అధికారులతో చర్చలు జరిపి పనితీరును తెలుసుకున్నారు. పలువురు వినియోగదారులను స్వయంగా కలసి, వారికి విద్యుత్‌ సరిగ్గా అందుతోందా? లేదా? అన్న విషయాలు తెలుసుకున్నారు. విద్యుత్‌ బిల్లుల బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లించాలని చెప్పారు. దీంతో వినియోగదారులు పెద్ద సంఖ్యలో అక్కడికక్కడే బిల్లులు చెల్లించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/