మీరు చెప్పినన్ని కిట్లు ఉన్నాయా? లేవా?

మరి డాక్టర్లకు కరోనా ఎట్లా సోకింది?… ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

uttam kumar reddy

హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కరోనా వ్యాప్తిపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై విమర్శలు గుప్పించారు. వైద్యులకు పీపీఈ కిట్లు అందడంలేదని, ప్రభుత్వం మాత్రం వాటిని అందిస్తున్నామని చెప్పుకుంటోందని ఆయన విమర్శించారు. ‘రాష్ట్రంలో లక్షల కొద్దీ పీపీఈ కిట్లున్నాయి అని చెప్పారు కదా? మరి డాక్టర్లకు కరోనా ఎట్లా సోకింది? మీరు చెప్పినన్ని కిట్లు నిజంగానే ఉన్నాయా? లేవా? ఉంటే వాటి నాణ్యత సంగతేంది? ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలె’ అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ట్వీట్ చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/