ప్రభుత్వంపై ఉత్తమ్ కుమార్ విమర్శలు
పండిన వరిలో ప్రతి గింజ కొంటామని మాట తప్పారన్న ఉత్తమ్

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత తమదేనని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా పండిన 1 కోటి 5 లక్షల టన్నుల వరిలో ప్రతి గింజ కొంటామని తెలంగాణ సిఎంవో మాట ఇచ్చి నేటికి 45 రోజులైందని, కానీ ఇప్పటివరకు కొన్నది 44 లక్షల టన్నులేనని విమర్శించారు. రాష్ట్రంలో వరి రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇది ముమ్మాటికీ మాటల ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/