తెలంగాణ రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఉత్తమ్ డిమాండ్

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై టీఆర్ఎస్ గూండాలు దాడులకు పాల్పడుతున్నారని హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉత్తమ్ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని సీఐకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించే వారిపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించి ఎన్నికలు నిర్వహించాలని పార్లమెంట్ లో కోరతానని అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. లేకపోతే తిప్పలు తప్పవని ఉత్తమ్ హెచ్చరించారు.టీఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.