భార్యతో కలిసి ప్రేమ చిహ్నాన్ని చూడనున్న ట్రంప్
తాజ్మహల్ను సందర్శించనున్న ట్రంప్ దంపతులు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈనెల 24, 25న భారత్ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ట్రంప్ తన భార్యతో కలిసి 24న తాజ్మహల్.. ప్రేమ చిహ్నాన్ని చూడనున్నారు. దీంతో ఖేరియా విమానాశ్రయం నుంచి తాజ్మహల్ రూట్లో క్లీనింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. తాజ్ పరిసర ప్రాంతాలను సుందరంగా మార్చేస్తున్నారు. ఆగ్రా పట్టణంలోని ప్రముఖ కూడళ్లను అందంగా తీర్చిదిద్దుతున్నారు. తాజ్ చుట్టూ ఉన్న గోడలపై వెరైటీ పెయింటింగ్స్ వేస్తున్నారు. ట్రంప్ రాక నేపథ్యంలో అమెరికా భద్రతా బలగాలు ఇప్పటికే తాజ్మహల్ను సందర్శించాయి. కాగా, ఈ నెల 24న ట్రంప్ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు. ఢిల్లీలో ట్రంప్ భారత పార్లమెంటుపై ప్రసంగించనున్నారు. ఢిల్లీలో బస చేసిన తర్వాత ఆగ్రాకు బయల్దేరతారు. అక్కడ తాజ్ను సందర్శించి తర్వాత గుజరాత్ లోని అహ్మదాబాద్కు వెళ్లనున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/