వచ్చేవారం భారత్కు రానున్న అమెరికా వెంటిలేటర్లు
అమెరికా వైట్ హౌస్ వెల్లడి
వాషింగ్టన్: కరోనా వేళ భారత్కు ఇస్తామన్న వెంటిలేటర్లలో కొన్నింటిని వచ్చేవారం పంపనున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రకటించింది. నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోడి ఫోనులో మాట్లాడుకున్నారు. సంభాషణలో భాగంగా ట్రంప్ మోడికి ఈవిషయం చెప్పినట్లు వైట్ హౌస్ తెలిపింది. మొదటగా దాదాపు 100 వెంటిలేటర్లు పంపన్నుట్లు పేర్కొంది. భారత్కు సాయం చేసే అవకాశం రావడం పట్ల ట్రంప్ హర్షం వ్యక్తం చేసినట్లు శ్వేతసౌధం తెలిపింది. రెండు నెలల క్రితం అమెరికాకు భారత్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ను సరఫరా చేసిన విషయం తెలిసిందే. కాగా, జీ7 కూటమి శిఖరాగ్ర సదస్సుకు రావాలని మోడిని ట్రంప్ ఆహ్వానించారు. భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, డబ్ల్యూహెచ్వోలో సంస్కరణలు వంటి అంశాలపై కూడా వారు మాట్లాడుకున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/