మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల పట్ల స్పందించిన అగ్రరాజ్యం

ప్రవక్తపై నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, ఢిల్లీ బీజేపీ మీడియా విభాగం ఇన్చార్జి నవీన్ కుమార్ జిందాల్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల పట్ల అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. బీజేపీకి చెందిన ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.

ఈ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ కూడా బహిరంగంగా ఖండించడం తమ దృష్టికి వచ్చిందని, మానవ హక్కులపై గౌరవాన్ని పెంపొందించుకోవాలని భారత్ కు సలహా ఇస్తున్నాం అని అమెరికా హితవు పలికింది. మతస్వేచ్ఛ, మానవ హక్కుల ఆందోళనలు తదితర అంశాలపై భారత కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వ్యక్తులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతుంటామని నెడ్ ప్రైస్ పేర్కొన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/