రెమ్‌డిసివిర్ మొత్తం కొనేసిన అమెరికా

రెమ్‌డిసివిర్ ఔష‌ధాల్ని డీల్‌ కుదుర్చుకున్న ట్రంప్‌

Remdesivir

వాషింగ్టన్‌: రెమ్‌డిసివిర్ ఔష‌ధాన్ని అమెరికా సొంతం చేసుకున్న‌ది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉత్ప‌త్తి అవుతున్న ఈ ఔష‌ధాల‌ను మొత్తం ఆ దేశ‌మే కొనేసింది. క‌రోనా వైర‌స్ చికిత్స‌లో రెమ్‌డిసివిర్ ఔష‌ధం మెరుగ్గా ప‌నిచేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే రెమ్‌డిసివిర్‌తో అమెరికా అసాధార‌ణ ఒప్పందం కుదుర్చుకున్న‌ది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌ర‌ఫ‌రా అయ్యే ఆ ఔష‌ధాల‌ను త‌మ‌కే ఇవ్వాల‌ని డోనాల్డ్ ట్రంప్ ప్ర‌భుత్వం డీల్ కుదుర్చుకున్న‌ది. గిలీడ్ సైన్సెస్ సంస్థ ఈ ఔష‌ధాన్ని త‌యారు చేస్తున్నారు. ఈ ఔష‌ధం వాడిన వారు చాలా వేగంగా కోవిడ్ నుంచి కోలుకుంటున్న‌ట్లు తేలింది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమ‌న్ స‌ర్వీసెస్ శాఖ తాజాగా ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. రెమ్‌డిసివిర్‌ను ఉత్ప‌త్తి చేసే గిలీడ్ సంస్థ‌తో ట్రంప్ స‌ర్కార్ అద్భుత‌మైన ఒప్పందాన్ని కుదుర్చుకున్న‌ట్లు పేర్కొన్న‌ది. జూలైలో జ‌రిగే వంద శాతం ఉత్ప‌త్తిని అంటే సుమారు 5 ల‌క్ష‌ల డోస్‌ల‌ను త‌మ‌కే ఇవ్వాల‌ని గిలీడ్‌తో అమెరికా డీల్ చేసుకున్న‌ది. ఆగ‌స్టులో 90 శాతం, సెప్టెంబ‌ర్‌లో 90 ఔష‌ధ స‌ర‌ఫ‌రాను కూడా త‌మ‌కే ఇవ్వాల‌ని ట్రంప్ స‌ర్కార్ గిలీడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న‌ది. ద‌క్షిణ కొరియాలో రెమిడిసివిర్ ఔష‌ధ వినియోగం ప్రారంభ‌మైంది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/