పవన్ సినిమా ప్రదర్శనకి నో చెప్పిన యుఎస్‌ మల్టీప్లెక్స్ ఓనర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి సినిమా రిలీజ్ అవుతుందంటే నిర్మాతలకే కాదు థియేటర్స్ లలో సైకిల్ స్టాండ్ వారికీ కూడా పండగే. హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా ప్రేక్షకులు తండోపతండాలుగా సినిమాను చూసేందుకు వస్తారు. పవన్ ప్లాప్ సినిమాలు కూడా కాసుల వర్షం కురిపిస్తుంటాయి. అలాంటి పవన్ కళ్యాణ్ సినిమాకు షాక్ ఇచ్చారు యుఎస్‌ మల్టీప్లెక్స్ ఓనర్స్. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా రిలీజ్ అవుతుంటే..ఆ సినిమా ప్రదర్శనకి నో చెప్పారు యుఎస్‌ మల్టీప్లెక్స్ ఓనర్స్.

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. అగ్ర హీరోలు నటించిన పాత చిత్రాలు సరికొత్త టెక్నలాజి తో రీ రిలీజ్ అవుతూ అభిమానులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ – ఎస్ జె సూర్య కలయికలో తెరకెక్కిన ఖుషి మూవీ ఈ నెల 31 న తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రీ రిలీజ్ కాబోతుంది. అయితే యుఎస్ మల్టీప్లెక్స్ ఓనర్స్ మాత్రం ‘ఖుషీ’ మూవీని రీరిలీజ్ చేయలేమని తేల్చి చెప్పేశారట. ఇటీవల పలు హీరోల తాలూకా సినిమాలు రీ రిలీజ్ చేయడంతో నష్టాల్ని మిగిల్చాయని..అందుకే ఖుషి ని రీ రిలీజ్ చేయలేమని తేల్చి చెప్పారట.