భారత్‌కు అమెరికా సాయం

2.9 మిలియన్‌ డాలర్లు ప్రకటించిన అమెరికా

modi, trump
modi, trump

అమెరికా: భారత దేశంలో కరోనా ను కట్టడి చేసేందుకు, అగ్రరాజ్యం అమెరికా 2.9 మిలియన్‌ డాలర్లను ప్రకటించింది. ఈ మొత్తం విలువ భారత కరెన్సిలో 21కోట్లు. కరోనా కట్టడికి ఇప్పటికే అమెరికా భారత్‌కు వంద మిలియన్‌డాలర్ల ప్యాకేజిని ప్రకటించింది. కాగా కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా 64 దేశాలకు 174 మిలియన్‌ డాలర్లను అమెరికా ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఐసీయు బెడ్స్‌, మెడికల్‌ బెడ్స్‌, పారా మెడికల్‌ వైద్య సిబ్బంది కోసం ఖర్చు చేయాలని తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/